Friday, April 19, 2024

పవన్‌ కళ్యాణ్‌ని చూసి షాక్ అయ్యా.. ఏం మాట్లాడాడో చెప్పిన మత్స్యకారుడు

- Advertisement -
- Advertisement -

 

విశాఖపట్నం: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ విశాఖపట్నంలోని బీచ్‌ను సందర్శించి, అక్కడి బీచ్‌లో ఉన్న స్థానిక మత్స్యకారులతో ముచ్చటించారు. ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఫోటోలు సందడి చేస్తున్నాయి. నెటిజన్ల నుండి విపరీతమైన స్పందన లభిస్తోంది. జగన్నాదం అనే మత్స్యకారుడు మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ని చూసి షాక్ అయ్యానని, పవన్ కాదా అని మొదట అనుమానం వచ్చిందని అన్నారు.

మత్స్యకారుల సంఘంలో ఎదురవుతున్న సమస్యలపై పవన్‌ తనను పలకరించారని ఆయన తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని బోట్లకు డీజిల్ కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తనతో చెప్పినట్లు పేర్కొన్నాడు. రాయితీలు, సముద్రంలో లభించే చేపల గురించి కూడా దాదాపు 10 నిమిషాల పాటు తనతో మాట్లాడారని జగన్నాదం వివరించాడు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పవన్‌ కల్యాణ్ భరోసా ఇచ్చినట్లు అతను చెప్పాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News