బరేలి: వావి వరుసలు మరచి, చిన్నా, పెద్దా తేడా లేకుండా అత్యాచారానికి ఒడిగడుతున్న కామాంధులు దేశంలో రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నారు. ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలి సిటిలో ఓ మహిళపై కామాంధులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న స్నేహితుడి భార్యపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ ఘటన సిటిలోని సిరౌలి ప్రాంతంలో శుక్రవారం రాత్రి జరగగా, బాధితురాలు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న తనపై ఇంటిప్రక్కల ఉన్న నలుగురు వ్యక్తులు దాడి చేసి, అత్యాచారం చేశారని, ఈ విషయం ఎవరికైన చెబితే భయంకరమైన పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని బెదిరించి వెళ్లిపోయారని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, నలుగురు నిందితులు తన భర్తకు తెలుసునని, నిందితుల్లో ఒకరు తన భర్తకు వ్యతిరేకంగా కుట్ర పన్నాడని, దీంతో తన భర్తను డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో అరెస్టు చేశారని పేర్కొంది. ఒక కిలో డ్రగ్స్ అక్రమ రవాణ కేసులో పట్టుబడడిన బాధితురాలి భర్త ప్రస్తుతం మొరాదాబాద్ జిల్లా జైలులో ఉన్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపిసి సెక్షన్ 376 చట్టం, హత్యాయత్నం కేసు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితును పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Woman Gangraped by Husband’s Friends in Bareilly UP