Saturday, July 27, 2024

ఎనిమిదవ తరగతి విద్యార్థితో లేచిపోయిన 26ఏళ్ల టీచర్..

- Advertisement -
- Advertisement -

 

గాంధీనగర్: ఇరవై ఆరేళ్ల ఓ టీచర్, పద్నాలుగేళ్ల ఎనిమిదవ తరగతి విద్యార్థితో లేచిపోయిన సంఘటన గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో చోటుచేసుకుంది. దీంతో బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సదరు టీచర్ తన కొడుకుని మాయమాటలతో అకర్షించి తమ నుంచి దూరంగా తీసుకుపోయిందని, శుక్రవారం నుంచి తన కొడుకుతోపాటు టీచర్ కూడా కనిపించడంలేదని పేర్కొన్నాడు. కాగా, ఆ బాలుడితో సదరు టీచర్ సంవత్సరం పాటు సన్నిహితంగా ఉందని, ఈ నేపథ్యంలో వారిని మందలించామని స్కూల్ సిబ్బంది తెలిపారు. దీంతో ఐపిసి సెక్షన్ 363 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు కనిపించకుండా పోయిన టీచర్, బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Woman Teacher Elopes With Class VIII boy in Gandhinagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News