Thursday, March 28, 2024

డబ్ల్యూపిఎల్ వేలంలో 409 మంది ప్లేయర్లు..

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఉమెన్స్ ప్రిమియర్ లీగ్ ఆరంభ వేలంపాటలో 409మంది ప్లేయర్లు పాల్గొంటున్నట్లు బిసిసిఐ మంగళవారం తెలిపింది. ఈ నెల 13న డబ్ల్యూపిఎల్ వేలంపాట జరగనుంది. వేలంపాటలో పేర్లు నమోదు చేసుకున్న 409మందిలో 246మంది భారత క్రికెటర్లు, మిగిలిన 163మంది క్రికెటర్లుగా బిసిసిఐ పేర్కొంది. వేలంపాటకు మొత్తం ప్లేయర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ జాబితాను 409కు కుదించారు.

మొత్తం 90 మంది ప్లేయర్ల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీరిలో 30మంది ప్లేయర్లతో భర్తీ చేయాల్సి ఉంటుంది. తుదిజాబితాలో 199మంది ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయని అన్‌క్యాప్డ్ ప్లేయర్లు కాగా 8మంది ఆయా దేశాల తరఫున ప్రాతినిధ్యం వహించారు. హయ్యస్ట్ రిజర్వు ధర బిసిసిఐ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News