Wednesday, May 8, 2024

‘నైరుతి’ వచ్చేసింది

- Advertisement -
- Advertisement -

కేరళలో విస్తారంగా వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
48గంటల్లో తమిళనాడు, కర్ణాటకలోకి రుతుపవనాలు
వారం రోజుల్లో తెలంగాణలోకి దేశ ప్రజల్లో హర్షాతిరేకం

మన తెలంగాణ/హైదరాబాద్: దోబూచులాటకు తెరపడింది. అవిగో ఇవిగో అంటూ గత వారం రోజులుగా ఊరిస్తూ వచ్చిన నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు భారత ప్రధాన భూభాగాన్ని తాకాయి. గురువారం ఉదయానికే రుతుపవనాలు కేరళ రాష్ట్ర తీరాన్ని తాకాయి. విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అలప్పుజా, ఎర్నాకుళం ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ అరేబియా సముద్రంలోని అన్ని ప్రాంతాలకు రుతుపనాలు వేగంగా వ్యాప్తి చెందినట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సెంట్రల్ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్‌తో కేరళ , తమిళనాడులోని చాలా ప్రాంతాలపై రుతుపవనాలు ఆవరించాయని ఐఎం డి తెలిపింది. కొమరిన్ కేప్, గల్ఫ్ ఆఫ్ మున్నార్‌తో ఆగ్నేయ , మ ధ్య , ఈశాన్య బంగాళాఖాతానికి నైరుతి రు తుపవనాలు వ్యాప్తి చెందినట్టు తెలిపింది. సాధారణంగా జూన్ ఒకటిన రుతుపవనా లు కేరళను తాకుతుంటాయి. కొన్నిసార్లు వా రం రోజులు కాస్త అ టు ఇటూ అయ్యే అవకాశాలు ఉంటాయి.

రుతు జూన్ 4న కేరళ తీరాన్ని తాకుతాయని గత నెలలో వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐఎండి అంచనాలు కొంత తప్పిపోయినప్పటికీ కాస్త అటు ఇటూగా నాలుగు రోజులు ఆలస్యంగా రుతుపనాలు దేశ భూభాగంలోకి ప్రవేశించాయి. మరోవైపు వాతావరణ అంచనాలకు సంబంధిచిన ప్రైవేటు సంస్థ స్కైమెట జూన్ 7న రుతుపవనాలు కేరళతీరాన్ని తాకే అవకాశాలు ఉన్నట్టు ప్రకటించింది. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ బిపర్జాయ్ తుపాను ప్ర భావం వల్ల రుతుపవనాల రాక ఆలస్యం అ య్యే అవకాశాలు ఉన్నాయని ఇదివరకు వా తావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇవి కేరళ తీరానికి బలహీనంగా కదలివచ్చే అవకాశం ఉందని అంచాన వేశారు. భారత ద్వీ పకల్పంలోని ఇతర ప్రాంతాలకు రుతుపవనాల వ్యాప్తి చెందడం సైతం ఆలస్యం కావొచ్చని తెలిపారు. బిపర్జాయ్ ప్రభావంతో వ ర్షాలు కురిసినా , రుతుపవనాల విస్తరణ ఆ లస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్టు అం చ నా వేశారు. రుతుపవనాలపైన తుపాను ప్ర భావం పెద్దగా పడలేదని తెలుస్తోంది. నైరు తి రుతుపవనాలు మరో 40గంటల్లో కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండి బుధవారం నాడు ప్రకటించినట్టుగానే వాటికదలికల్లో వేగం మరింత పెరిగి ఐఎండి అంచనాలకంటే ఒక రోజు ముందుగానే ఇవి కేరళ తారాన్ని తాకాయి.

మరో వారం రోజుల్లో తెలంగాణకు :
రుతు పవనాలు కేరళ అంతటా విస్తరించా యి.వీటి ప్రభావంతో ఆ రాష్ట్రమంతటా వి స్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతు ప వనాల కదిలిక కూడా వేగంగానే ఉంది. ప్ర స్తుతం లక్షద్వీప్ , కేరళ ప్రాంతాలకు విస్తరించిన రుతుపవనాలు మరో 48గంటల్లో తమిళనాడు , కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు విస్తారిస్తాయని ఐఎండి వెల్లడించింది. ఇవీ రాయల సీమ మీదుగా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అన్ని విధాల అనుకూల పరిస్థితులు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వారం రోజల్లోనే ఇవి తె లంగాణలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్న ట్టు చెబుతున్నారు. బిపర్జాయ్ తుపాను కూ డా తీవ్ర తుపానుగా మారింది. ఇది గంటకు 5కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా పయనించిందని ఐఎండి వెల్లడించింది. గోవాకు పశ్చి మ నైరుతి దిశలో 850కిలోమీటర్ల దూరం లో తుపాను కేంద్రీకృతమైందని వివరించిం ది. ముంబాయికి నైరుతి దిశలో 900కిలోమీటర్ల దూరంలో తుపాను ఉందని తెలిపింది. వచ్చే 24గంటల పాటు తుపాను మరింత తీవ్రంగా మారి ఉత్తర వాయువ్య దిశలో పయనిస్తుందని ఐఎండి స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News