Thursday, April 25, 2024

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

భద్రాది: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన భద్రాది జిల్లా మణుగూరు మండలం సాంబయ్యగూడెం వద్ద శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివవరాలలోకి వెళితే.. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. బైకు పై ఇద్దరు యువకులు వెళ్తుండగా బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు సంఘటన స్థలంలోనే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరకున్న పోలీసులు గాయపడిన యువకుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News