Monday, February 17, 2025

కడుపు నొప్పి భరించలేక యువకుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కడుపునొప్పి భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బస్తాపూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. శనివారం ఎస్ఐ సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బిక్కనూర్ మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన పూజారి ప్రశాంత్ 28 అనే యువకుడు గత కొన్ని రోజుల నుండి కడుపు నొప్పి తో బాధపడుతు ఆసుపత్రుల చుట్టు తిరిగినా నయం కాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో దూలానికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాధు మేరకు పంచనామా నిమిత్తం శవాన్ని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయికుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News