Friday, April 26, 2024

ప్రేమ వ్యవహారం.. యువకుడి కిడ్నాప్, హత్య

- Advertisement -
- Advertisement -

young man murdered in sangareddy

పటాన్ చెరువు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలో గురువారం దారుణం చోటుచేసుకుంది. భానూరులో యువకుడిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. అక్టోబర్ 7 తేదీన భానూరు నుంచి శివకుమార్ అనే యువకుడు కనిపించకుండా పోయాడు. ప్రేమవ్యవహారంలో యువతి కుటుంబీకులు శివకుమార్ ని కిడ్నాప్ చేశారు. అనంతరం చంపి ముషీరాబాద్ లోని కాలువలో పడేశారు. యువకుడిని తామే హత్య చేసినట్లు యువతి కుటుంబసభ్యులు అంగీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహం కోసం గాలిస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News