Friday, April 26, 2024

యువకుడి ఇంటి ఎదుట యువతి ధర్నా

- Advertisement -
- Advertisement -

dharna

బోడుప్పల్: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయిరాం నగర్ లో నివాసం ఉంటున్న పీ గౌతమ్ అనే యువకుడు తిరుపతి నిర్మళ (27)ని గత పది సంవత్సరాల నుంచి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి తీరా మరో యువతీతో వివాహానికి సిద్ధం కావడంతో విషయం తెలుసుకున్న యువతి తన బంధువులతో కలిసి యువకుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది.

పూర్తి వివరాల్లోకి వేలితే నెల్లురూ వడ్డిపల్లికి చెందిన తిరుపతి నిర్మళ తన అక్క భావాలు మంచిర్యాలలో ఉంటున్న సమయలో వారి వద్దే ఉంటూ చదువుకునేది అదే సమయంలో వరంగల్ జిల్లాకు చెందిన ఆర్.ఎస్‌ఐ వెంకటేశ్వర్లు మంచిర్యాలలోని పోలీసు క్వార్టర్ లో నివాసం ఉంటున్న సమయంలో తన కోడుకు పీ.గౌతమ్ 31 తో 2013 నుండి పరిచయం ఏర్పడింది అపరిచయం కాస్తా ప్రేమగా మారి వివాహానికి దారి తీసింది.అయితే అబ్బాయి తరుపున వారు పెండ్లికి నిరాకరించడంతో 16-10-2018న యువతి మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

ఇది ఇలా ఉండగానే గౌతమ్ కుటుంబ సభ్యులు అతనికి మరో యువతీతో వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలుసుకున్న యువతి బోడుప్పల్ లోని యువకుడి నివాసానికి తన తల్లి,ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ధర్నాకు దిగింది. విషయం తెలుసుకున స్థానిక పోలీసులు ఘటన స్థలానికి ఇరువర్గాలను శాంతింప చేశారు.ఈ సందర్భంగా యువతీ మీడియాతో మాట్లాడుతూ నాకు న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుండి కదిలేది లేదని తనకు గౌతమ్ తో వివాహం జరిగేలా పెద్దలు చోరువ చూపాలని డిమాండ్ చేసింది.

Young woman stages dharna in front of lovers house

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News