- Advertisement -
బెజ్జంకి: కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలో లాక్డౌన్తో పెళ్లి ఆలస్యమవుతోందని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వడిగే శిరీష అనే యువతి(19) ఎల్లంపల్లి గ్రామంలోని ఓ యువకుడిని ప్రేమించింది. ఆ ప్రేమ జంట ఇరుకుటుంబాలను ప్రేమ పెళ్లికి ఒప్పించారు. శిరీష తండ్రి సౌదీ ఆరేబియాలో ఉండడంతో ఇంటికి రాలేకపోవడంతో పెళ్లి ఆలస్యమవుతుందని మనస్థాపం చెందిన యువతి పురుగుల మందు తాగింది. వెంటనే యువతిని కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ఆస్పత్రిలో కన్నుమూసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -