Tuesday, April 30, 2024

వివేకా హత్య కేసు వైఎస్ భాస్కర్ రెడ్డికి ఊరట..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు 12 రోజుల ఎస్కార్ట్ బెయిల్ మంజూరైంది. అనారోగ్య కారణాలతో తనకు 15 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ భాస్కర్ రెడ్డి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అటు ఆయన ఆరోగ్య పరిస్ధితిపై చంచల్‌గూడ జైలు అధికారులు న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. దీనిని పరిశీలించిన కోర్టు సానుకూలంగా స్పందించింది. భాస్కర్ రెడ్డికి 12 రోజుల ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. 12 రోజుల పాటు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 3 వరకు బెయిల్ కు సీబీఐ కోర్టు ఎస్కార్ట్ బెయిల్ కు అనుమతించింది. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు ఏప్రిల్ 16న అరెస్టు చేశారు. వైఎస్‌ఆర్ జిల్లా పులివెందులలోని భాస్కర్ రెడ్డి ఇంటికి ఏప్రిల్ 16 తెల్లవారుజామునే రెండు వాహనాల్లో సిబిఐ అధికారులు 10 మందికి పైగా వెళ్లి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

భాస్కర్ రెడ్డి కుమారుడు ఎంపి అవినాష్ రెడ్డి పిఎ రాఘవరెడ్డిని కూడా అప్పుడు అదుపులోకి తీసుకున్నారు. వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి కుట్రకు పాల్పడ్డారని కేసు నమోదైంది. 120బి రెడ్ విత్ 302, 201 సెక్షన్ల కింద భాస్కర్‌రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. హత్య అనంతరం సాక్ష్యాధారాల ధ్వంసంలో భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిబిఐ అధికారులు అభియోగం మోపారు. వివేకా హత్య కేసులో ఒక కుట్రదారుడిగా భాస్కర్ రెడ్డిపై అభియోగాలు మోపారు. వివేకా గుండెపోటుతో మరణించినట్లుగా తొలుత ప్రచారం జరిగిం దని, ఆ గుండెపోటు ప్రచారంలో భాస్కర్ రెడ్డి పాత్ర ఉన్నట్లుగా ఆరోపించారు. హత్యకు ముందు భాస్కర్ రెడ్డి ఇంట్లో సునీల్ ఉన్నట్లుగా ఆధా రాలు గురించినట్లుగా సిబిఐ అధికారులు అప్పట్లో వెల్లడించారు. జూన్ నెలలో భాస్కర్ రెడ్డి బెయిల్ కోసం సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు. భాస్కర్ రెడ్డి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇదే కేసులో అవినాష్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ తీర్పును న్యాయవాది ప్రస్తావించారు.

వివేకా హత్య కేసులో ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని సిబిఐ అధికారులు ఆరెస్ట్ చేశారని న్యాయ వాది ఉమామహేశ్వర్ రావు అన్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను జూన్ నెలలో సిబిఐ కోర్టు కొట్టి వేసింది. భాస్కర్ రెడ్డి అత్యంత ప్రభావిత వ్యక్తి అని, బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని, సాక్షులను ప్రభావితం చేస్తారని సిబిఐతో పాటు వివేకా కుమార్తె సునీత చేసిన వాదనలను సిబిఐ కోర్టు జడ్జి పరిగణనలోకి తీసుకున్నారు. కేసు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని న్యాయమూర్తి తెలిపారు. సెప్టెం బరు 4న కూడా వైఎస్ భాస్కర్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. కేసు విచారణలో భాగంగా భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. ఆయనతో పాటు మరో నిందితుడు ఉదయ్ కుమార్ పిటిషన్‌ను కూడా న్యాయస్థానం తిరస్కరించింది. తాజాగా భాస్కర్ రెడ్డికి సిబిఐ కోర్టు 12 రోజుల ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News