Thursday, April 18, 2024

బస్సు-లారీ ఢీ: 12 మందికి తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

వెల్గటూర్: ఎండపల్లి మండలం కొత్తపేట వద్ద రాష్ట్ర రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాలలోాకి వెళితే.. స్థానికులు , పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..శుక్రవారం నాడు రాయపట్నం నుండి కరీంనగర్ వైపు కు వెళ్తున్న లారీని, గజ్వేల్ నుండి ధర్మపురి యాత్ర కై వెళ్తున్న ప్రైవేటు బస్సు కొత్తపేట వద్ద ఎదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు గల కారణం ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. గురువారం రాత్రి వీచిన ఈదురు గాలులకు రోడ్డు ప్రక్కనున్న చెట్టు కోమ్మ విరిగి రోడ్డు పడిపోయింది.   గజ్వేల్ నుండి 25 మంది యాత్రికులతో ధర్మపురి వెళ్తున్న బస్సు విరిగిపడిన కొమ్మను తప్పించబోయి అటుగా వస్తూన్న లారీ ని ఢీ కొట్టింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News