Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 13,272 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Telangana Reports 605 new corona cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 13,272 మందికి కరోనా వైరస్ సోకగా 36 మంది చనిపోయారు. మహారాష్ట్ర(2285), ఢిల్లీ(1417), కర్నాటక(1573), కేరళ(1093) ఈ నాలుగు రాష్ట్రాలలో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. కరోనా వైరస్ నుంచి 4.37 కోట్ల మంది కోలుకోగా 5.27 లక్షల మంది చనిపోయారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 88.21 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వించామని ఐసిఎంఆర్ ప్రకటించింది.  దేశంలో 4.42 కోట్ల మందికి కరోనా వైరస్ సోకగా ప్రస్తుతం 1.01 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. 209 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News