Thursday, May 2, 2024

భారత్‌లో తాజాగా 14 కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో గురువారం తాజాగా 14 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు యాక్టివ్ కేసులు 252 నుంచి 247 కు స్వల్పంగా తగ్గాయి. దేశం మొత్తం మీద కొవిడ్ కేసుల సంఖ్య 4.50 కోట్లు ( 4,50,01,343 ) ఉండగా, మరణాలు 5,33,294 వరకు ఉన్నాయి. మరణాల రేటు 1.19 శాతం ఉంది. కొవిడ్ నుంచి కోలుకున్నవారి శాతం 98.81 శాతం కాగా, వారి సంఖ్య 4,44,67,802 వరకు ఉంది. ఆరోగ్య మంత్రిత్వశాఖ వెబ్‌సైట్ ప్రకారం ఇంతవరకు కొవిడ్ వ్యాక్సిన్‌డోసులు 220.67 వరకు పంపిణీ అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News