Wednesday, May 8, 2024

2019లో 160 మంది ఉగ్రవాదుల హతం

- Advertisement -
- Advertisement -
indian-army
102 మంది అరెస్టు, మిలిటెన్సీలో చేరే స్థానిక యువత సంఖ్య తగ్గుదల

జమ్ము : 2019లో జమ్ముకశ్మీర్‌లో 160 మంది ఉగ్రవాదులు హతం కాగా, 102 మంది అరెస్టు అయ్యారని, అయినా ఇంకా 250 మంది ఉగ్రవాదులు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దిల్‌బాగ్ సింగ్ మంగళవారం చెప్పారు. మిలిటెన్సీలో చేరే స్థానిక యువకుల సంఖ్య బాగా తగ్గిందని అన్నారు. 2018 లో 218 మంది యువకులు మిలిటెన్సీలో చేరగా, 2019లో 139 మంది మాత్రమే చేరారని సింగ్ పాత్రికేయులకు వెల్లడించారు.

కొత్తగా 89 మంది మాత్రమే రిక్రూట్ అయ్యారని, మిగతా వారు చేరిన 24 గంటల నుంచి రెండు మూడు నెలల్లోనే వారు తిరిగి తమ మూమూలు జీవితం లోకి వచ్చేసారని చెప్పారు. జెహంగీర్ సరూరి, రియాజ్ నయికూ వంటి పాత ఉగ్రవాదులు కొంతమంది ఇంకా తమ కార్యకలాపాలు సాగిస్తున్నారని తెలిపారు. ఉగ్రవాద సంఘటనలు 30 శాతం తగ్గాయని, అలాగే శాంతి భద్రతలకు సంబంధించి గత ఏడాదితో పోలిస్తే అలాంటి సంఘటనలు 36 శాతం తగ్గాయని అన్నారు. ఇలాంటి సంఘటనలు గత ఏడాది 625 వరకు జరగ్గా, ఈ ఏడాది 481 వరకు జరిగాయని వివరించారు.

160 Terrorists Killed 102 Arrested in Jammu And Kashmir

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News