- Advertisement -
ఏథెన్స్ : లింబే లోని కెమెరూనియన్ రేవు వద్ద గ్రీకు చమురు నౌక పై మంగళవారం సాయుధులైన దుండగులు దాడి చేసి 8 మంది నావికులను కిడ్నాప్ చేశారు. బందీలైన వారిలో ఐదుగురు గ్రీకులు, ఇద్దరు ఫిలిప్పైన్లు, ఒకరు ఉక్రెయిన్, ఉన్నారు. హేపీ లేడీ అనే పేరు గల ఈ నౌకలో మొత్తం 28 మంది నావికా సిబ్బంది ఉన్నారు. గ్రీకు పౌరుడు ఈ సందర్భంగా గాయపడ్డాడని గ్రీస్ సముద్ర వాణిజ్య మంత్రి యానిస్ ప్లకియోటకిస్ వెల్లడించారు. పశ్చిమ ఆఫ్రికా తీరంలో నౌకలపై దాడులు చేయడం, నావికులను కిడ్నాప్ చేయడం ఎక్కువగా జరుగుతుంటుంది.
Eight sailors abducted from Greek oil tanker
- Advertisement -