Thursday, April 25, 2024

దేశంలో కొత్తగా 17070 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

17070 Corona positive cases in India

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో 17070 మందికి కరోనా వైరస్ సోకగా 23 మంది దుర్మరణం చెందారు. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్నాటక, ఢిల్లీ రాష్ట్రాలలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటి దేశ వ్యాప్తంగా 4.34 కోట్ల మంది కరోనా వైరస్ సోకగా 5.24 లక్షల మంది ప్రాణాలు విడిచారు. కరోనా వ్యాధి నుంచి 4.28 కోట్ల మంది కోలుకోగా గురువారం 14 వేల మంది డిశ్చారయ్యారు. ప్రస్తుతం  లక్ష మందిపైగా చికిత్స పొందుతున్నారు. దేశ వ్యాప్తంగా 197 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News