Thursday, April 25, 2024

రాష్ట్రంలో కొత్తగా 189 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

189 new covid-19 cases reported in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 36,883 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 189 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. గురువారం నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,76,376కు పెరిగింది. తాజాగా 137 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 6,68,701 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 3,995కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.86 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,680 యాక్టివ్ కేసులున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News