- Advertisement -
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు బిఎస్ఎఫ్ జవాన్లు మృతిచెందారు. గందేర్బాల్ జిల్లాలో వెళ్తున్న బిఎస్ఎఫ్ జవాన్ల వాహనంపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పారా మిలిటరీ 37 బెటాలియన్కు చెందిన ఇద్దరు సైనికులు మరణించారు. వెంటనే అప్రమత్తమైన బిఎస్ఎఫ్ దళాలు ఘటనాస్థలాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
2 BSF Soldiers killed in Terrorist Encounter at Ganderbal
- Advertisement -