- Advertisement -
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. శ్రీనగర్ లోని హబక్ చౌక్ లో బుధవారం మధ్యాహ్నం సిఆర్ పిఎఫ్ సిబ్బంది టార్గెట్ గా ఉగ్రవాదులు ఈ దాడి చేశారు. అయితే ఈ దాడిలో సైనికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.. కానీ, ఇద్దరు పౌరులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. గ్రనేడ్ దాడి జరిగిన వెంటనే భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు.
2 civilians injured in Grenade attack in Srinagar
- Advertisement -