Saturday, April 27, 2024

కొడుకు పుట్టలేదని మహిళ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

కర్నూల్: తనకు కొడుకు పుట్టడంలేదని తీవ్ర మనస్తాపానికి గురై ఓ మహిళ ఆత్మహత్య చేసకుంది. ఈ విషాద ఘటన జిల్లాలో మిడుతూరు మండలంలోని సుంకేసుల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన జగదీశ్, ఆత్మకూరు మండలానికి చెందిన సారమ్మ అనే మహిళను 2000 సంవత్సరంలో పెళ్లిచేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం ఆడపిల్లలే కావడంతో.. సారమ్మ తనకు కొడుకు పుట్టలేదని ఎప్పుడూ బాధపడుతుండేది. దీంతోపాటు అప్పుడప్పుడు ఆమెకు తీవ్రంగా కడుపునొప్పి వచ్చేది. ఈ రెండింటిని భరించలేని ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Woman committed suicide over not having son in Kurnool

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News