Friday, April 19, 2024

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, 22మందికి తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

 

ఆగ్రా: ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో 22మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.యుపి రోడ్ వేస్ వోల్వొ బస్ ఆగ్రా నుంచి లక్నో వెళ్తుండగా.. తెల్లవారుజామున దట్టంగా పొగమంచు అలుముకోవడంతో బస్సు డ్రైవర్ రోడ్డుపక్కన ఉన్న ట్రక్కును ఢీకొట్టాడు. దీంతో బస్సు ఎక్స్‌ప్రెస్‌వేకి దాదాపు 40 అడుగుల దిగువకు పడిపోయింది. స్థానికులు వెంటనే అక్కడి వెళ్లి బస్సులో ఉన్నవారిని బయటికి తీసే ప్రయత్నం చేయడంతోపాటు ఫతేహబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడినవారిని ఆగ్రా ఆస్పత్రికి తరలించారు. బస్సులో చిక్కుకున్న మరికొంతమంది ప్రయాణికులను బయటికి తేసేందుకు సహాయక చర్యలు చేపట్టారు.

2 Killed in Bus Accident at Agra-Lucknow Expressway

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News