Monday, May 6, 2024

కడుపు నొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

కామారెడ్డి : ఉరి వేసుకుని వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన భిక్నూర్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భిక్నూర్‌ పట్టణానికి చెందిన గంధం భార్గవి గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతుంది. కడుపునొప్పి బాధ భరించలేక, జీవితంపై విరక్తి చెంది మంగళవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బుధవారం ఉదయం గమనించిన కుటుంబీకులు భార్గవిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరిణించిందని వైద్యులు తెలిపారు. దాంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ గౌడ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News