Friday, April 26, 2024

అనంతపురంలో జేఎన్టీయూ విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: జేఎన్టీయూ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీలో ఈసీఈ రెండో సంవత్సరం విద్యార్థి చాణక్య (19) గురువారం ఉదయం ఎల్లోరా హాస్టల్ పై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. నెల్లూరు ఉదయగిరి చెందిన చాణుక్య బుధవారం రాత్రి తన మిత్రులతో మాట్లాడి తెల్లవారుజామున 5:30 గంటలకు తన స్నేహితులకు ‘బై’ అని మెసేజ్ పంపి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చాణుక్య మొదటి సంవత్సరంలో 9.8 జి.పి.ఎ మార్కులు సొదించినట్లు స్నేహితులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News