Thursday, September 18, 2025

ఎట్టకేలకు ఓటేసిన సిఎం

- Advertisement -
- Advertisement -

ఐజ్వాల్: మిజోరం సిఎం, మిజో నేషనల్ ఫ్రంట్ చీఫ్ జొరాంతంగ ఎట్టకేలకు తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉదయం పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఐజ్వాల్‌లోని వైఎంఏ పోలింగ్ కేంద్రానికి ఆయన చేరుకున్నారు. అయితే సాంకేతిక కారణాలతో ఈవీఎం మెషిన్ మొరాయించింది. దీంతో ముఖ్యమంత్రి కొద్దిసేపు అక్కడే నిరీక్షించారు. కానీ అది ఎంతకూ బాగుకాకపోవడంతో చేసేదేం లేక మళ్లీ వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఉదయం 11 గంటలకు మరోసారి పోలింగ్ కేంద్రానికి వచ్చిన జొరాంతంగ.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News