Wednesday, May 1, 2024

రండి చర్చకు సీట్లు సిద్ధం

- Advertisement -
- Advertisement -

అమిత్ సవాల్‌ను స్వీకరించిన సిఎం భూపేష్

రాయ్‌పూర్ : చత్తీస్‌ఘఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతుండగా ఆ రాష్ట్ర సిఎం భూపేష్ బఘేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. బిజెపి, కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విసిరిన సవాల్‌కు భూపేష్ బఘేల్ అంగీకరించారు. గత ఐదేండ్లుగా తాను చేసిన అభివృద్ధి, 15 ఏండ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు.

15 ఏండ్లుగా మీ హయాంలో వెలుగుచూసిన కుంభకోణాలు, ఐదేండ్లలో తాము చేసిన పనులపై చర్చ జరగాలని భూపేష్ బఘేల్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. నల్ల రంగు సోఫాపై ఇరువైపులా అమిత్ షా, భూపేష్ బఘేల్ పేర్లున్న ఫొటోను కూడా ఆయన ట్వీట్ చేశారు. చర్చా వేదిక, సమయం, ప్రదేశం గురించి మీరు ఇంకా వెల్లడించలేదని, అయితే ప్రజలు మాత్రం ఇప్పటికే వేదికను సిద్ధం చేశారని రాసుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News