Tuesday, May 21, 2024

నెత్తురోడిన దండకారణ్యం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/చర్ల :ఛత్తీస్‌గఢ్‌లోని నా రాయణ్ పూర్, కంకెర్ జిల్లాలో సరిహద్దుల్లోని అ డవుల్లో మంగళవారం భద్రతా దళాల ఎదురు కా ల్పులలో ముగ్గురు మహిళలతోసహా 10మంది నక్సలైట్లు మ రణించారు. గత 15 రోజుల్లో భద్రతా దళాల ఎదు రుకాల్పులలో ఇంత పెద్ద సంఖ్యలో న క్సలైట్లు మ రణించడం ఇది రెండవసారి. రాష్ట్రంలో జరు గుతున్న నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో ఇదో భారీ విజయమని ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ఒక వీడియో సందేశంలో తెలిపారు. నక్సలైట్ల కు గట్టి పట్టు ఉన్న ప్రాంతంగా భావించే అభూజ్ మడ్‌లోని టేక్‌మెట, కాకూర్ గ్రామాల మ ధ్య ఉ న్న అటవీ ప్రాంతంలో ఉదయం 6 గంటల కు కా ల్పుల పోరు జరిగిందని పోలీసులు తెలిపా రు. న క్సల్ ఏరివేత కోసం జిల్లా రిజర్వ్ గార్డు (డిఆర్‌జి), ప్రత్యేక టాస్క్ ఫోర్స్(ఎస్‌టిఎఫ్) సం యుక్తంగా గాలింపు జరిపినపుడు ఈ ఘటన జ రిగిందని వారు చెప్పారు. గాలింపు చర్యలు సో మ వారం రాత్రి ప్రారంభం కాగా అభూజ్‌మడ్ ప్రాం తంలో మంగళవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరి గిందని రాష్ట్ర హోం శాఖను కూడా నిర్వర్తి స్తున్న డిప్యూటీ ముఖ్యమంత్రి శర్మ తెలిపారు. ము గ్గురు మహిళల తోసహా 9 మంది నక్సలైట్లు ఎదురు కా ల్పులలో హతమయ్యారని, వారి మృతదేహాల ను స్వాధీనం బలగాలు స్వాధీనం చేసుకున్నాయ ని ఆయన చెప్పారు.

ఈ కాల్పుల పోరులో భద్రతా ద ళాలకు ఎటువంటి హాని జరగలేదని ఆయన వి వ రిం చారు. ఘటనా స్థలి నుంచి ఒక ఎకె 47 తు పా కీ, ఆయుధాలు మందుగుండు సామగ్రిని స్వా ధీ నం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆప రేషన్‌ను గొప్ప విజయంగా అభివర్ణించిన శర్మ భ ద్రతా సిబ్బందిని అభినందించారు. నక్సలైట్లు ఆయుధాలు వదలిపెట్టి జన జీవన ప్రవంతిలో కలవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోందని, నక్సల్స్‌కు చెందిన పెద్ద దళం కాని చిన్న దళం కాని వీడియో కాల్ ద్వారా లేదా మధ్యవర్తి ద్వారా చర్చలు జరపాలని భావిస్తే తాము అందుకు సిద్ధమని, వారికి మెరుగైన పునరావాస ప్యాకేజ్ అందచేస్తామని కూడా శర్మ ప్రకటించారు. జన జీవన స్రవంతిలో కలవాలని వారిని కోరుతున్నానమని, బస్తర్‌లో శాంతి నెలకొని ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని తాము ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. కాగా..మరణించిన నక్సలైట్ల వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. తాజా సంఘటనతో కలిపి ఈ ఏడాదిలో ఇప్పటివరకు బస్తర్ ప్రాంతంలో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 88 మంది నక్సలైట్లు మరణించారని పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 16న కంకెర్ జిల్లాలో జరిగిన భద్రతా దళాల ఎదురుకాల్పులలో 29 మంది నక్సలైట్లు మరణించారు.

బీజాపూర్ జిల్లాలో 16 మంది మావోల లొంగుబాటు
బీజాపూర్ జిల్లాలో 16 మంది మావోయిస్టులు జిల్లా ఎస్‌పి జితేంద్ర కుమార్ యాదవ్ ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో బెటాలియన్ నెంబర్ వన్ సభ్యుడుతో పాటు మత్వారా ఎల్‌ఒ ఎస్ కమాండర్, కెఎంఎస్ అధ్యక్షుడు, సిఎంఎం కమాండర్, ఎల్‌జిఎస్ సభ్యుడుతో సహా 16 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు. లొంగిపోయిన పిఎల్‌జిఏ బెటాలియన్ సభ్యుడికి ఎనిమిది లక్షలు, ఎల్‌ఒఎస్ కమాండర్‌కు ఐదు లక్షల రూపాయలు, మిగిలిన వారికి లక్ష చొప్పున ప్రభుత్వం రివార్డులు ప్రకటించిందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన గర్వాపస్ కార్యక్రమంతో మావోయిస్టులు లొంగిపోతున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.
ఐఇడి పేలి కార్మికుడు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందు పాత్ర పేలి ముఖేష్ పటేల్ అనే కార్మికుడు మృతి చెందాడు. ఆముదై గనుల్లో కూలి పనులకు వెళ్లి, తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ ఐఇడిపై అడుగులు వేయడంతో అది పేలి తీవ్ర గాయాలతో మృతి చెందాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News