Tuesday, May 21, 2024

సిఎంకు నోటీసులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర హోమంత్రి అమిత్‌షా ప్రసంగానికి సంబంధించిన ఫేక్ వీడియో కేసు కీలకమలుపు తిరిగింది. రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అమిత్ షా మాట్లాడిన వీడియో మార్ఫింగ్ చేసిన కేసులో రాష్ట్ర పిసిసి అధ్యక్షుడి హోదాలో ఉన్న సిఎం రేవంత్‌రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. అమిత్ షా వీడియో ఎడిట్ చేసి వైరల్ చేసినందుకు బిజెపి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఢిల్లీలో కేసు నమోదైంది. వీడియోను ఎడిట్ చేసి తెలంగాణ పిసిసి అధికారిక ఎక్స్ (ట్విటర్) హ్యాండిల్ అకౌంట్‌లో పోస్ట్ చేశారన్నది ఫిర్యాదు. దీంతో కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జీలు మన్నె సతీష్, నవీన్, శివకుమార్, తస్మీన్‌లకు సైతం సీఆర్పీసీ 91 కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు.

ఇదే కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. మే 1న విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. విచారణకు వచ్చేటప్పుడు సిఎం రేవంత్ వినియోగించిన ఎలక్ట్రానిక్ డివైస్‌లను తీసుకురావాలని కోరారు. అమిత్ షా తెలంగాణలోని ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తూ బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబిసిలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. ఆ ప్రసంగాన్ని పలువురు వక్రీకరించి ఎస్సీ, ఎస్టీ, ఓబిసిల రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పినట్లు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే బిజెపి మాత్రం అసలు వీడియోలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడినట్లు స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News