రాజస్థాన్కు చెందిన అజ్మీర్లోని దిగ్గి బజార్లో ఉన్న హోటల్లో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం జరుగడంతో ఓ నాలుగేళ్ల మైనర్ సహా నలుగురు మరణించారని అధికారులు తెలిపారు. దిగ్గి బజార్లోని ఇరుకు సందులో ఆ హోటల్ ఉన్నందున రెస్కూ ఆపరేషన్కు కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయని సమాచారం. ఆ హోటల్కు అగ్నిమాపక దళం ఎన్ఓసి లేకపోవడమేకాక అనేక ఇతర మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలను కూడా ఆ హోటల్ ఉల్లంఘిస్తోందని అధికారులు తెలిపారు. తెల్లవారు జామున నాజ్ హోటల్లో షార్ట్ సర్కూట్ కారణంగా అగ్ని ప్రమాదం మొదలయింది.
తర్వాత అది మొత్తం నాలుగంతస్తుల బిల్డింగ్కు వ్యాపించిందని పోలీసులు తెలిపారు. అగ్నిమాపక దళం మూడు గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పేశారని సిటీ ఎడిఎం గజేంద్ర సింగ్ రాథోడ్ ధ్రువీకరించారు. కాగా ఇద్దరు పురుషులు, మహిళ, పిల్లాడు చనిపోయారు అని జెఎల్ఎన్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ అనిల్ సమారియా తెలిపారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయని, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వివరించారు. గాయపడిన వారికి 50 నుంచి 90 శాతం మేరకు గాయాలయ్యాయని తెలిపారు.