Thursday, September 25, 2025

ఎన్ని కుట్రలు చేసిన బిజెపిని ఆపలేరు:రామచంద్రర్ రావు

- Advertisement -
- Advertisement -

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో వచ్చేది బిజెపి ప్రభుత్వమేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బిజెపి గెలిపించడం ఖాయమని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదిశగా పనిచేయాలని ఆయన సూచించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో అందరూ పట్టణాలను వీడి పల్లెల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. గ్రామపంచాయతీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ బిజెపి గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరని రామచందర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీచేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం ఎదురుచూస్తున్నారని రామచందర్‌రావు వ్యాఖ్యానించారు. బిజెపి మద్దతుతోనే తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొంది రాష్ట్రం ఏర్పడిందని,

నలబైఏళ్ల పాటు పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి వరకు ఎదగడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వచ్చిన తెలంగాణను గత పదేళ్లపాటు నిలువునా ముంచిన పార్టీ బీఆర్‌ఆర్ అని ఆరోపించారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలను చూసిన ప్రజలు ప్రత్యాన్మయంగా బిజెపికి పట్టం గట్టేందుకు సింసిద్దులవుతున్నారని, ఈ అవకాశాన్ని పార్టీ కార్యకర్తలు, నాయకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించాయని, గ్రూప్ వన్ పోస్టులను భర్తీచేయలని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జిఎస్టీ తగ్గింపు నిర్ణయాన్ని దేశ ప్రజలందరూ స్వాగతిస్తున్నారని, దీని వల్ల అన్నిసామాజిక వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రాష్ట్రంలో యూరియా బ్లాక్ మార్కెట్ దందా కొనసాగుతుండడం వల్లే రైతులకు యూరియా అందుబాటులో లేకుండా పోయిందని విమర్శించారు.

30న ‘మేరా దేశ్ పహలే’
ప్రధాని నరేంద్ర మోదీ గారి జీవన ప్రయాణంపై ప్రత్యేకంగా రూపొందించిన ‘మేరా దేశ్ పహలే’ కల్చరల్ కార్యక్రమాన్ని ఈనెల 30వ తేదీన హైటెక్ సిటీలో నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నట్లు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గౌతం రావు తెలిపారు. పదాధికారుల సమావేశం సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు హాజరుఅవుతారని, దాదాపు 10 వేల మంది పాల్గొనే విధంగా కార్యక్రమం రూపొందించినట్లు వెల్లడించారు. కొత్తగా నియామకమైన ఆఫీస్ బేరర్స్‌తో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు తొలిసారిగా సమావేశమమై పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై కీలక సూచనలు చేశారని వివరించారు. ఈ సమావేశానికి పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే సేవా కార్యక్రమాలపై సమీక్ష, ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. అదేవిధంగా స్వదేశీ ఉద్యమంలో భాగంగా అన్ని జిల్లాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని కూడా తీర్మానించినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

Also Read: ‘గ్లోబల్ హెల్త్ కేర్ హబ్’ గా హైదరాబాద్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News