Friday, May 3, 2024

మరింత ముదిరిన ఇడి, ఆప్ వివాదం

- Advertisement -
- Advertisement -

వేధింపుల విచారణకు రాను
వీడియో విచారణకు సిద్ధం
మరోమారు విచారణకు వెళ్లని కేజ్రీవాల్
ఇప్పటివరకూ తొమ్మిది సమన్లు గాలికి

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీపార్టీ అధినేత , ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఇడి సమన్లను బే ఖాతరు చేశారు. లిక్కర్ కేసుకు సంబంధించి సో మవారం తమ ఎదుట విచారణకు రావాలని ఇడి సమన్లు వెలువరించింది. అయితే ఇప్పుడు తాను రాలేనని, అయినా ఈ నెల 12వ తేదీ తరువాత ఎప్పుడైనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొంటానని కేజ్రీవాల్ తన లాయర్ల తరఫున వివరణ ఇచ్చారు. ఈ విధంగా దీనితో ఆయ న ఇడి సమన్లకు డుమ్మా కొట్టడం ఎనిమిదవ సారి అయింది. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ వీడని నీడలా చుట్టుకుంది. పలువురు నేతలు విచారణలు ఎదుర్కొంటుండగా, కొందరు జైలు పాలయ్యారు. కేజ్రీవాల్ ఇప్పుడు తిరిగి తమ సమన్లను బేఖాతరు చేయడంపై ఇడి వర్గాలు వెంటనే అధికారికంగా స్పం దించాయి. ఆయన సమాధానాన్ని ముందుగా తాము క్షుణ్ణంగా పరిశీలిస్తామని వెల్లడించారు. అయితే ఆన్‌లైన్ ప్రక్రియలో ఆయనను విచారించేందుకు ఇడి అనుమతిని ఇవ్వకపోవచ్చు.

మరోసారి అంటే తొమ్మిదోసారి సమన్లను జారీ చేస్తుందని స్పష్టం అయింది. కాగా తనకు తరచూ సమ న్లు పంపించడంపై ఆప్ నేత ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఇడికి సమాధానం ఇవ్వడానికి తాము సిద్ధం అని, అయితే ఇడి ఈ విషయంలో వ్యవహరిస్తున్న తీరు కేవలం రాజకీయ కక్షపూరితం తప్పితే విచారణ క్రమంగా లేదని మండిపడ్డారు. కాగా లోక్‌సభ ఎన్నికల కీలక ఘట్టం దశలోనే కేజ్రీవాల్‌ను ఏదో విధంగా ఈ కేసులో ఇరికించి జైలుకు పంపించేందుకు ఇడి సమాయత్తం అయిందని ఆప్ వర్గాలు నిరసన వ్యక్తం చేశాయి. సమన్లను తిరస్కరించిన కేజ్రీవాల్ ఇప్పుడు ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉందని, కోర్టు తుది నిర్ణయం వరకూ వేచి చూడటం ఎవరికైనా మంచిదని సోమవారం తమ ప్రకటనలో తెలిపారు. కాగా తరచూ ఆయన సమన్లను బేఖాతరు చేయడంపై ఇడి స్థానిక సిటికోర్టులో కేసు పెట్టింది. దీనిపై కేజ్రీవాల్ ఈ నెల 16వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావల్సి ఉంటుంది. ఇటువంటివి తాము పట్టించుకోబోమని కేజ్రీవాల్, ఆయన పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించండి, దీనిని ప్ర త్యక్షంగా ప్రజల వీక్షణానికి ప్రసారం చేయండని ఆప్ డిమాండ్ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News