Saturday, July 27, 2024

యుపి ఎన్నికల్లో పోటీ చేస్తాం: ఢిల్లీ సిఎం‌

- Advertisement -
- Advertisement -

AAP to contest UP Assembly election 2022

న్యూఢిల్లీ : యుపిలో 2022 జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయనున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ తెలిపారు. రానున్న ఈ ఎన్నికల్లో ఆప్ తన అభ్యర్థులను బరిలో దింపుతుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. యుపిలో అభివృద్ధి మందగించిందన్న సిఎం కేజ్రీవాల్.. ఫలితంగానే యుపి ప్రజలు ఢిల్లీకి వలస వస్తున్నారన్నారని తెలిపారు. ఢిల్లీలో ప్రజలకు ఎన్నో సౌకర్యాలు సిద్ధం చేసినప్పుడు… ఉత్తర్ ప్రదేశ్ లో ఎందుకు సాధ్యపడదని ఆయన ప్రశ్నించారు. యుపిలో ఇకపై కొత్త రాజకీయాలను చూస్తారని కేజ్రీవాల్ వెల్లడించారు. భారత్ లో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఎందుకు మారడం లేదు..? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. యుపి ప్రజలు పాత రాజకీయాలతో విసిగిపోయారని తమపై విశ్వాసం ఉంచుతారని కేజ్రీ అశాభావం వ్యక్తం చేశారు.

AAP to contest UP Assembly election 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News