Monday, April 29, 2024

బాలీవుడ్ డ్రగ్స్ కేసు: అర్జున్‌ రాంపాల్‌కు ఎన్‌సిబి సమన్లు..

- Advertisement -
- Advertisement -

ముంబై: బాలీవుడ్ డ్రగ్స్‌ వ్యవహరంలో నటుడు అర్జున్‌ రాంపాల్‌కు నార్కోటిక్స్‌‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సిబి) మళ్లీ సమన్లు జారీ చేసింది. యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసుకు బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధం ఉందనే ఆరోపణలు రావడంతో ఎన్‌సిబి దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో పలువురు బాలీవుడ్ ప్రముఖులను ఎన్‌సిబి అధికారులు విచారించారు. ఇందులో భాగంగా నటుడు అర్జున్‌ రాంపాల్‌ను కూడా నవంబర్ 13న ఎన్‌సిబి విచారించింది. అంతకుముందు అర్జున్‌ రాంపాల్‌ నివాసంపై ఎన్‌సిబి అధికారులు దాడులు నిర్వహించి, ఆయన డ్రైవర్ ను విచారించారు. ఆయన గర్ల్‌ఫ్రెండ్‌ గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్‌ను కూడా వచారించిన అధికారులు.. డ్రగ్‌ పెడ్లర్‌తో సంబంధాలు ఉన్నాయని గాబ్రియెల్లా సోదరుడు అగిసిలాస్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, ఈ కేసులో మరింత సమాచారం కోసం అర్జున్‌ రాంపాల్‌ను ఎన్‌సిబి అధికారులు మరోసారి విచారించనున్నారు. రేపు(బుధవారం) డిసెంబర్ 16న విచారణ కోసం ఎన్‌సిబి కార్యాలయానికి హాజరుకావలని అర్జున్‌ రాంపాల్‌కు అధికారులు సమన్లు జారీ చేశారు.

NCB again summoned to Arjun Rampal in Drug Probe

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News