- Advertisement -
గోపీచంద్, నయనతార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ‘ఆరడుగుల బుల్లెట్’ ఆగస్టులో రిలీజ్ కానుంది. జయబాలజీ రీల్ మీడియా పతాకంపై తాండ్ర రమేష్ నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్టులో రిలీజ్కి ఫిల్మ్మేకర్స్ సన్నాహకాల్లో ఉన్నారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా నిర్మాత స్వయంగా రిలీజ్ చేస్తున్నారు. ప్రకాష్రాజ్-, బ్రహ్మానందం,- అభిమన్యు సిన్హా తదితరులు ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించగా.. మణిశర్మ మ్యూజిక్ అందించారు. బాలమురగన్ సినిమాటోగ్రఫీ.. అబ్బూరి రవి డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
- Advertisement -