హైదరాబాద్: మొబైల్ ఫోన్ను చోరీ చేసిన ఇద్దరు దొంగలను అబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్, టివిఎస్ అపాచీ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. అబిడ్స్ ఇన్స్స్పెక్టర్ రవికుమార్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని మొఘల్పురా, షాలిబండకు చెందిన ఎండి ఇర్ఫాన్ అలీ, మీర్చౌక్, షాదిలాల్గల్లికి చెందిన ఎండి అబ్దుల్ రజాక్ అలియాస్ కాజిం ఎసి మెకానిక్గా పనిచేస్తున్నాడు. నిందితులు ఇద్దరు కూకట్పల్లిలో టివిఎస్ అపాచీ బైక్ను చోరీ చేసి దాని నంబర్ ప్లేట్ను తొలగించి తిరుగుతున్నారు.
గత ఏడాది డిసెంబర్, 31వ తేదీన డిగ్రీ కాలేజీ విద్యార్థిని కోషికా ఉమా బస్సుదిగి కాలేజీకి వెళ్తుండగా ఇద్దరు నిందితులు బైక్పై వెనుక వచ్చి మొబైల్ ఫోన్ను గుంజుకుని వెళ్లారు. విద్యార్థిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. సిసిటివిల ఫుటేజ్ ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. అబిడ్స్ ఎసిపి బిక్షం రెడ్డి పర్యవేక్షణలో ఇన్స్స్పెక్టర్ రవికుమార్, అడిషనల్ ఇన్స్స్పెక్టర్ గోపి, ఎస్సై లక్ష్మయ్య దర్యాప్తు చేశారు.
Abids police arrested two robbers