- Advertisement -
రాజన్న సిరిసిల్ల : కొత్త సంవత్సరం వేడుకలో మద్యం మత్తులో బైక్ నడుపుతు ఈలలు వేస్తూ, రోడ్డుపై బీర్ బాటిల్ పగలగొట్టి పోలీసులతో వాగ్వాదానికి దిగిన యువకులపై పోలీసులు లాఠీ ఝుళిపించిన విషయం తెలిసింది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే స్పందించారు. యువకులను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకున్నారు. యువకులను కొట్టిన ఇద్దరు సబ్ ఇన్ స్పెక్టర్స్, ఒక కానిస్టేబుల్, ఒక హోమ్ గార్డ్ ను పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Action against police for hitting teenagers in Sirisilla
- Advertisement -