మళ్లీ బంగారం ధర పెరుగుతోంది. వరుసగా మూడు రోజులుగా గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంది. హైదరాబాద్లో శుక్రవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.50 పెరిగింది. ప్రస్తుత ధర రూ.41,050. ఇక 22 క్యారట్ బంగారం 10 గ్రాములపై రూ.70 పెరిగి రూ.38,020 నుంచి రూ.38,090 ధరకు చేరుకుంది. న్యూ ఢిల్లీలో 10 గ్రాముల బంగారం రూ.32 పెరిగింది. ప్రస్తుత ధర రూ.40,590. అంతర్జాతీయంగా చూస్తే ఔన్స్ వెండి ధర 1,555 డాలర్లు. బంగారం లాగానే వెండి ధర కూడా పెరుగుతోంది. హైదరాబాద్లో కేజీ వెండిపై రూ.100 పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.49,400. న్యూ ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.116 పెరిగి రూ.47,756 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 18.02 డాలర్లు. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 14 పైసలు పడిపోయింది. రూపాయి విలువ తగ్గడంతోపాటు అంతర్జాతీయ కారణాల వల్ల బంగారం, వెండి ధరలు మెల్లమెల్లగా పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.