Thursday, March 28, 2024

కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో మంత్రి కెటిఆర్ తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా శాసన సభలో కెటిఆర్ మాట్లాడారు. అంబేద్కర్ మార్గదర్శకంలోనే టిఆర్‌ఎస్ పని చేస్తోందన్నారు. దేశానికి దార్శినికతను చూపిన వ్యక్తి అంబేద్కర్ అని మంత్రి పేర్కొన్నారు. ఆర్టికల్ 3తో కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అంబేద్కర్ అవకాశం కల్పించారన్నారు. స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని అంబేద్కర్ కోరుకున్నారని గుర్తు చేశారు. అవి లేకపోతే రాజకీయ ప్రజాస్వామ్యం విజయవంతం కాదని అంబేద్కర్ అన్నారని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News