సహస్ర ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ వెంకీ, వర్ష విశ్వనాథ్, చాందిని భగవాని హీరో హీరోయిన్లుగా మోహన్ మర్రిపెల్లి దర్శకత్వంలో డాక్టర్ రవీంద్ర నాయుడు నిర్మిస్తున్న చిత్రం ‘అందమైన లోకం’. శుక్రవారం ఈ చిత్రం పూజ కార్యక్రమాలు హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత కూతురు సహస్ర హీరో, హీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, డాక్టర్ రవీంద్ర నాయుడు కెమెరా స్విచాన్ చేశారు. చిత్ర దర్శకుడు మోహన్ మర్రిపెల్లి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఇంకా ఈ కార్యక్రమానికి డైరెక్టర్లు సీతారామరాజు, సత్యరాజ్, సతీష్ మల్లంపాటిలు హాజరై చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిత్ర దర్శకుడు మోహన్ మరిపెల్లి మాట్లాడుతూ “మంచి బ్యూటిఫుల్ లవ్ స్టొరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రెండు లవ్ స్టోరీస్ ఉంటాయి.
ప్రస్తుతం లవ్లో ఉన్న వారు, లవ్ ఫెయిల్యూర్ అయినవారు, లవ్లో పడాలనుకునే వారికి.. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ట్విస్ట్, టర్న్స్తో, మంచి మెసేజ్తో వస్తున్న చిత్రమిది”అని అన్నారు. నిర్మాత డాక్టర్ రవీంద్ర నాయుడు మాట్లాడుతూ “నేను సినిమా చేద్దామనుకున్న సమయంలో దర్శకుడు నాకు ఈ కథ చెప్పాడు. కథ నచ్చడంతో మేము ఈ స్క్రిప్ట్ కోసం చాలా రోజులు వర్క్ చేశాము. మంచి టీంను ఎంపిక చేసుకొని ఈ సినిమా చేస్తున్నాము”అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా, ఎడిటింగ్ః శ్రావణ్ జి. కుమార్, సంగీతం :- ప్రశాంత్ బిజె.