Saturday, July 27, 2024

రైతుల నిరసన దీక్షలో విషాదం.. గుండెపోటు రైతు మృతి

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: రాజధానిని తరలించొద్దంటూ రైతులు చేపట్టిన నిరసన దీక్షలో శనివారం విషాదం చోటుచేసుకుంది. ఈ నిరసన దీక్షలో పాల్గొన్న దొండపాడుకు చెందిన కొమ్మినేని మల్లిఖార్జునరావు అనే రైతు తీవ్ర ఆవేధనకు లోనై గుండెపోటుతో మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో గతకొద్ది రోజులుగా అమరావతిలో రైతులు, ప్రజాప్రతినిధులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బోస్టన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌తో మరింత ఆవేదనకు గురైన రైతులు ఆందోళనలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మల్లిఖార్జునరావుకు గుండెపోటు రావడంతో అక్కడే మృతిచెందాడు. దీంతో మల్లిఖార్జునరావు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. అమరావతి కోసం మల్లికార్జునరావు తన పది ఎకరాల భూమిని కూడా ఇచ్చారు.

AP Capital Protest Farmer dies with Heart attack

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News