Monday, May 6, 2024

ఎపిలో భారీగా పెరిగిన కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

AP Reports 3205 new corona cases in 24 hrs

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న 1800 పాజిటీవ్ కేసులు బయటపడగా.. ఈ రోజు పాజిటీవ్ కేసులు 3వేలు దాటాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో 36,452మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 3,205 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కరోనాతో బాధితులు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. తాజా కేసులతో ఇప్పటివరకు ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 20.84లక్షలకు చేరుకుంది. ఇక, కరోనా వైరస్ బారిన పడి 14,505మంది బాధితులు మరణించారు. గత 24 గంటల్లో 242 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటివరకు 20,62,974మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఎపిలో 10,119 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ పేర్కొంది.

AP Reports 3205 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News