Thursday, April 25, 2024

ఎపి రాజధాని ఎఫెక్ట్.. మహేష్ బాబు ఇంటిముందు విద్యార్థుల ఆందోళన

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని..ఈ అంశంపై ఎపికి చెందిన సినిమా హీరోలు స్పందించాలని ఎపి విద్యార్థులు డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నెల 19వ తేదీ వరకు ఎపికి చెందిన హీరోల ఇంటి ఎదుట ఆందోళనలు చేస్తామంటూ హెచ్చరించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఫిలిం నగర్ లోని సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటి ముందు ఎపి విద్యార్ధి యువజన పోరాట సమితి నిరసనలకు దిగింది. శనివారం అల్లు అర్జున్ ఇంటిముందు, జనవరి 12వ తేదీన మెగాస్టార్ చిరంజీవి, 13న బాలకృష్ణ, 14న జూనియర్ ఎన్టీఆర్, 15న మోహన్ బాబు, 16న మా అధ్యక్షుడు నరేష్ ,17న ప్రభాస్, 18న నాగార్జున, 19న వెంకటేష్ ఇళ్ల ముందు నిరాహార దీక్షలు చేస్తామని విద్యార్థులు ప్రకటించారు.కాగా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని గత కొన్నిరోజులుగా రైతులు పెద్ద ఎత్తున్న ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఆందోళనలకు గురై పలువురు రైతులు మృతి చెందారు. మరోవైపు సచివాలయ అధికారులు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపుతున్నారు.

AP Student Union protest at Mahesh babu’s house

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News