Saturday, July 27, 2024

గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1 నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 81 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఎపిపిఎస్సీ వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ, ప్రిలిమినరీ పరీక్ష మార్చి 17న నిర్వహిస్తారు. ఆప్‌లైన్ మోడ్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో ఈ పరీక్ష ఉంటుంది. డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించబోయే మెయిన్ పరీక్ష తేదీని ఇంకా ఖరారు చేయలేదు. మొత్తం పోస్టుల వివరాలు ఏపీ సివిల్ సర్వీస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 09,

ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ 18, డిఎస్పీ (సివిల్) 26, రీజనల్ ట్రాన్‌పోర్టు అధికారి 06, కోఆపరేటివ్ సర్వీసెస్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు 05, జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ 4, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3 , అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్,అసిస్టెంట్ అకౌంట్స్ అధికారి పోస్టులు 3, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 2, జైళ్ళ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్, జిల్లా బిసి వెల్ఫేర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ II అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు ఒకటి చొప్పున ఉన్నట్లు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News