Friday, April 19, 2024

ఎద్దు పొడవడంతో జవాన్ మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: ఎద్దు దాడి చేయడంతో ఆర్మీ జవాన్ మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అమ్రోహ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. యుపికి చెందిన అంకిత్ కుమార్ అనే జవాన్ పంజాబ్‌లోని ఫీరోజ్‌పూర్ 507 ఎఎస్‌సి బెటాలియన్‌లో పని చేస్తున్నారు. స్నేహితుడు పెళ్లి వేడుకలు ఉండడంతో సెలవు తీసుకొని సొంతూరుకు వచ్చాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఎద్దు ఎదురుగా వచ్చి కొమ్ములతో అంకిత్ కడుపులో పొడిచింది. అంకిత్ ఘటనా స్థలంలోనే చనిపోగా భార్య సోనమ్, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీస్ అధికారి సుశీల్ వర్మ కేసు నమోదు చేసి ఎద్దును గోశాలకు తరలించామన్నారు. కుమార్‌ది రైతు కుటుంబం. ఫిలిబిత్ ప్రాంతంలో బంటి లోది అనే వ్యక్తిని ఎద్దు పొడవడంతో అతడు కూడా మృతి చెందాడు.

Also Read: వేప చెట్ల తెగులుపై అధ్యయనం అవసరం : డోబ్రియల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News