- Advertisement -
సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియాలో మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఆసీస్ జట్టు 68 ఓవర్ల నాలుగు వికెట్లు 208 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆసీస్ జట్టు 302 పరుగుల ఆధిక్యంలో ఉంది. లబుసింగ్(73), స్మిత్ (81) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఆసీస్ బ్యాట్స్మెన్లలో డేవిడ్ వార్నర్(13), పకోస్కీ(10), లబుసింగ్(73), మాథ్యూ వాడే(04) పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో పెయిన్(05), కామెరూన్ గ్రీన్(22) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత్ బౌలర్లలో నవదీప్ సైనీ, అశ్విన్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా సిరాజ్ ఒక వికెట్ తీశాడు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్:338
భారత్ తొలి ఇన్నింగ్స్:244
- Advertisement -