Friday, April 26, 2024

ఆసీస్ 243/7

- Advertisement -
- Advertisement -

Australia scored 243 runs for 7 wickets

బ్రిస్బేన్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఆసీస్ 66.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 243 పరుగులతో ఆడుతోంది. ప్రస్తుతం ఆసీస్ 276 పరుగుల ఆధిక్యంలో ఉంది. లబుసింగ్ స్మిత్, వాడేను సిరాజ్ ఔట్ చేయగా గ్రీన్, టిమ్ పెయిన్ ను శార్థూల్ టాగూర్ వెనక్కి పంపడంతో ఆసీస్ ను కోలుకోలేని దెబ్బతీశారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు స్టీవెన్ స్మిత్(55), డేవిడ్ వార్నర్ (48), హరీస్(38), కామెరూన్ గ్రీన్(37), టిమ్ పెయిన్(27), లబుసింగ్(25), మాథ్యూ వాడే(0) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో కమ్నీస్ (02) , మిచెల్ స్టార్క్ (01) బ్యాటింగ్ చేస్తున్నారు. భారత్ బౌలర్లలో సిరాజ్, శార్థూల్ టాగూర్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా వాషింగ్ టన్ సుందర్ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News