Monday, April 29, 2024

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 24 గంటల్లో వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

UP Hospital Worker Dies Day After vaccine

లక్నో: కరోనా టీకా తీసుకున్న మరుసటి రోజే ఓ వ్యక్తి చనిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మోర్దాబాద్‌లో జరిగింది. మృతుడు ఆరోగ్య సమస్యలతో చనిపోయాడని జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్, కుటుంబ సభ్యులు తెలిపారు. మహిపాల్ సింగ్ అనే వ్యక్తి మోర్దాబాద్ ప్రభుత్వాస్పత్రిలో పని చేస్తున్నాడు. కోవిడ్ టీకా తీసుకున్న మరుసటి రోజు ఛాతీలో నొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డాడని, ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే అతడు చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో తన తండ్రికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. శవ పరీక్షలో మాత్రం గుండెపోటుతో చనిపోయాడని తేలింది. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత అతడిలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News