Wednesday, April 24, 2024

ట్రంప్ కు భారత్ కౌంటర్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కశ్మీర్ సమస్యపై ఎవరి జోక్యం అవసరం లేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. పాకిస్థాన్‌తో ద్వైపాక్షికంగా చర్చించి పరిష్కరించుకోవలసి ఉందని, ఈ మేరకు తగిన వాతావరణం కల్పించ వలసిన బాధ్యత పాకిస్థాన్‌పై ఉందని కేంద్ర విదేశీవ్యవహారాల మంత్రిత్వశాఖ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. కశ్మీర్ సమస్య పరిష్కారానికి ఎవరైనా కోరితే సహకరిస్తానని తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డావోస్‌లో ప్రకటించిన నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల అధికారులు ఈ ప్రకటన విడుదల చేశారు. కశ్మీర్‌పై తమ వైఖరి సుస్పష్టం, సుస్థిరంగానే ఉందని ఇది భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక అంశమని స్పష్టం చేశారు.

Bharat Counter over Trump Comments on Kashmir Issue

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News