- Advertisement -
చెన్నై: టిఫిన్ చేయలేదని తల్లిపై దాడి చేసిన అన్నను తమ్ముడు హత్య చేసిన సంఘటన తమిళనాడులోని బలరామపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శివరాజ్ (46) అనే వ్యక్తి తన తల్లి ధనలక్ష్మి(67), తమ్ముడు ప్రకాశ్ (44)తో కలిసి బలరామపురంలో నివసిస్తున్నారు. శివరాజ్ స్థానిక ఐసిఎఫ్లో పని చేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు. సోమవారం రాత్రి తల్లి టిఫిన్ చేయకపోవడంతో శివరాజ్ మందలించారు. దీంతో తల్లి, కుమారుడు మధ్య గొడవ జరిగింది. తల్లిపై శివరాజ్ దాడి చేయడంతో వెంటనే అన్నపై తమ్ముడు ప్రకాశ్ దాడి చేశాడు. అన్నను పక్కకు నెట్టేయడంతో తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
- Advertisement -