న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ రంగ టెలికమ్యూనికేషన్స్ సంస్థ బిఎస్ఎన్ఎల్ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ వినిపించింది. ఇండియన్ మార్కెట్లో మరో నయా ప్లాన్ను ప్రవేశపెట్టింది. భారత ఫైబర్ బ్రాండ్బ్యాండ్ కాంబో ప్లాన్ను ప్రారంభించినట్టు సంస్థ తెలిపింది. వినియోగదారులకు భారత్ ఫైబర్ బ్రాండ్బ్యాండ్ కాంబో ప్లాన్ రూ. 1,999 అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ను 90 రోజులపాటు ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణ, చెన్నైలో మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది. ఇందులో 1.5టిబి డేటా, 200ఎంబిపిఎస్తోపాటు ఏ నెట్వర్క్ కైనా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకునే సౌలభ్యం కల్పించింది. ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 6, 2020 వరకు ఈ ప్లాన్ను యాక్టివ్ చేసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ చందాదారులకు బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ ప్లాన్ను రూ. 999కే అందిస్తున్నట్టు ప్రభుత్వ టెలికం సంస్థ పేర్కొంది.
BSNL Bharat Fiber broadband plan Launched
- Advertisement -